అక్రమ రేషన్‌ బియ్యం పట్టివేత

చింతలపూడి (ఏలూరు) : అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్నట్లు చింతలపూడి ఎస్సై కుటుంబరావు తెలిపారు. సోమవారం ఎస్సై మాట్లాడుతూ … చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న రెండు టన్నులన్నర రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్నామన్నారు. ఆ రేషన్‌ బియ్యాన్ని సివిల్‌ సప్లయి డిపార్ట్‌మెంట్‌కి అప్పజెప్పినట్లు తెలిపారు.

➡️