విద్యా కళాశాల విద్యార్థి ప్రతిభ

Apr 12,2024 15:08 #Bapatla District

465 మార్కులు సాధించిన షణ్ముఖ ఆదిత్య

ప్రజాశక్తి – చీరాల : రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 2024 ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాలలో పట్టణంలోని శ్రీవిద్య జూనియర్ కళాశాల విద్యార్థి 465 మార్కులు సాధించి ప్రతిభ కనపరిచారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ నూకవరపు సూర్య ప్రకాశరావు మాట్లాడుతూ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న వలివేటి షణ్ముఖ గురు ఆదిత్య 465 సాధించడం తమ కళాశాలకు గర్వకారణం అన్నారు. ఈ సందర్భంగా షణ్ముఖ ఆదిత్యకు ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. అంతే గాక 460 మార్కులకు పైగా మరో ఐదుగురు విద్యార్థులు సాధించారని అన్నారు. విద్యార్థులను తీర్చిదిద్దటమే లక్ష్యంగా తమ కళాశాల అధ్యాపకులు నాణ్యమైన విద్యను అందించి విద్యార్థుల అభివృద్ధికి ఉన్నత భవిష్యత్తుకు కృషి చేయడం తమ కళాశాల ప్రత్యేకత అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను క్రమశిక్షణతో చదువిస్తూ తల్లిదండ్రుల ఆశయాలను విద్యార్థులు కైవసం చేసుకునేలా ప్రోత్సాహిస్తున్న కళాశాల ప్రిన్సిపాల్ సుభానిను మరియు ఇతర అధ్యాపకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

➡️