కొత్తవలసలో టిడిపి అభ్యర్థి ప్రచారం

Apr 28,2024 21:29

ప్రజాశక్తి – సీతానగరం : మండలంలోని కొత్తవలస, చెల్లంనాయుడు వలసలో ఆదివారం పార్వతీపురం నియోజకవర్గ టిడిపి అభ్యర్థి బోనెల విజరు చంద్ర ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే పేదలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తుందన్నారు. సూపర్‌ సిక్స్‌ గ్యారంటీలను అమలు చేస్తారన్నారు. కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్ష కార్యదర్శులు పెంట సత్యనారాయణ, రౌతు వేణుగోపాలనాయుడు. బి.శ్రీనివాసరావు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వీరఘట్టం : రానున్న సాధారణ ఎన్నికల్లో జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయకష్ణను గెలిపించాలని కోరుతూ మండలంలోని అచ్చప వలస గిరిజన గ్రామంలో పట్టణ టిడిపి అధ్యక్షులు జామి లక్ష్మీనారాయణ ఆదివారం ప్రచారం చేశారు. ముందుగా గ్రామంలో పర్యటించారు. అనంతరం గిరిజనులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తనను గెలిపిస్తే గ్రామంలోని సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతు కషి చేస్తామని గిరిజనులకు భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు నిమ్మక జయ కష్ణకు వేసి గెలిపించాలని గిరిజనులను కోరారు. కార్యక్రమంలో బల్ల హరిబాబు, పి మహేష్‌ , రాయిపల్లి రత్నాకర్‌ తోపాటు గిరిజనులు పాల్గొన్నారు.మొండింఖల్‌ లో టిడిపి ప్రచారం కురుపాం : మండలంలోని మొండెంఖల్‌ పంచాయతీలో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి టి.జగదీశ్వరి , రాష్ట్ర కార్యదర్శి వైరచర్ల వీరేష్‌ చంద్ర దేవ్‌ ఆదివారం ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి తమకు ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

➡️