23 న చెళ్ళూరు లో సీఎం బహిరంగ సభ

Apr 20,2024 15:45 #vijayanagaram

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :ఈ నెల 23 తేదిన మధ్యాహ్నం నాలుగు గంటలకు విజయనగరం మండలం చెళ్లూరు గ్రామం వద్ద ముఖ్యమంత్రి సిద్దం సభ జరుగుతుందని జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలు నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గని విజయవంతం చేయాలని వైసిపి జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావుపిలుపునిచ్చారు..శనివారం స్థానిక ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఎమ్మెల్యే అభ్యర్ధిగా కోలగట్ల నామినేషన్‌ వేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నే పద్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి బస్సు యాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే.బస్సు యాత్ర లో భాగంగా ఈ నెల 23 తేదిన విజయనగరం మండలం చేల్లూరు గ్రామం వద్ద మేమంతా సిద్దం సభ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సభకు జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల నుంచి నాయకులు,కార్యకర్తలు పాల్గనున్నట్లు తెలిపారు. అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులతో పాటు జిల్లా ప్రజలు పాల్గని విజయవంతం చేయాలని కోరారు.

➡️