ప్రజాశక్తి-ఏలూరు స్పోర్ట్స్ : ఏలూరు రూరల్ మండలం కొత్తూరు జూట్ మిల్ వద్ద ఉన్న తమ్మిలేరు వంతెన పై గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది పడి ఉన్నట్లు శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం మృతదేహం కుళ్లిన స్థితిలో ఉండడంతో గుర్తించడానికి కొంత సమయం పడుతుంది.