బకాయిలు కోసం కలెక్టరేట్ ఎదుట జెఏసీ ధర్నా

Feb 20,2024 14:44 #Dharna, #vijayanagaram

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు,ఉపాద్యాయులు ఇవ్వాల్సిన ఆర్ధిక బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎపి జె ఏ సి పిలుపులో భాగంగా జిల్లా జె ఏ సి ఆధ్వర్యంలో స్థానిక జెడ్పీ కార్యాలయం నుంచి ఎట్టుబ్రిడ్జి,అర్ అండ్ బి జంక్షన్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు.అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.ధర్నాను ఉద్దేశించి జె ఏ సి రాష్ట్ర ఉపాధ్యక్షులు డి వి రమణ, కార్యదర్శి సురేష్,పెద్దింటి అప్పారావు,ఉపాద్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగులు సమస్యలు పరిష్కారం చేయడంలో మాకు రావాల్సిన బకాయిలు చెల్లించకుండా తీవ్ర నిరాశకు గురి చేసిందన్నారు. ఉద్యోగులు పక్షపాతి అని చెప్పుకుంటూ ఉద్యోగులకు ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగకరమైన చర్యలు లేవన్నారు.మేము దాచుకున్న డబ్బు ఎపి జి ఎల్ ఐ,జిపీఫ్, గ్రాట్యుటీ వంటి డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వం ఉద్యోగులకు అన్యాయం చేస్తుందన్నారు. తక్షణమే మాకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఉద్యోగులు,ఉపాద్యాయులు పాల్గొన్నారు.

➡️