పల్నాడు జిల్లా: జిల్లాలో కొత్తగా నియమించిన ఆశా కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. నరసరావుపేటలోని పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో బుధవారం ఈ ఫోన్లను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రవి వారికి పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ గీతాంజలి, డిపిహెచ్ఎన్ఒ సురేఖ, డిసిఎమ్ నందిగం సురేష్ పాల్గొన్నారు.