ప్రజాశక్తి-విజయనగరం కోట : రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు, కేఆర్ హెల్పింగ్ హాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బి.కాంతారావు యాదవ్ అధ్యక్షతన కే.ర్ హెల్పింగ్ హాండ్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కేశవ శ్రీరామ ఆహ్వానం మేరకు 16 వార్డు లో ఉన్న బడుగు బలహీన పేద వర్గాల వారికి మంగళవారం ఉచితంగా బియ్యం పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ కాంతారావు మాట్లాడుతూ … ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన స్ఫూర్తితో పేద ప్రజలకు అణగారిన వర్గాలవారికి ఆర్థిక సామాజిక చైతన్యం అందించే క్రమంలో ఈరోజు వార్డులో ఉన్న పేదలకు పెద్ద ఎత్తున బియ్యం పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో పేద బడుగు వర్గాల వారికి చేయూతను అందించడంలో వారి ఆర్థిక స్థితిగతులను ఉన్నతంగా మలచడంలో ఎల్లవేళలా ఈ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. తనకున్న ఆర్థిక పరిధి మేరకు పేద ప్రజలకు సహాయ సహకారాలు అందించడంలో ముందుంటానని వారి సమక్షంలో చెప్పారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గన్న ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ అధ్యక్షులు ముద్దాడ మధు మాట్లాడుతూ … కేర్ హెల్పింగ్ హాండ్స్ ట్రస్ట్ చైర్మన్ కాంతారావు ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాన్నారు. పేద ప్రజల జీవన ప్రమాణాలు మార్చడంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని తెలియజేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రీజియన్ కోఆర్డినేటర్లు జానకిరామ్ మాట్లాడుతూ … సామాన్య మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాంతారావు అన్నారు. ఈరోజు రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులుగా నియమితులై తనకున్న ఆర్థిక పరిధి పరపతి మేరకు పేద ప్రజలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని సంకల్పంతో ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగిందని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని, విజయనగరం నియోజకవర్గంలో పేద ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కె ఆర్ హెల్పింగ్ హాండ్స్ ట్రస్ట్ సభ్యులు నవీన్ దాస్, కిరణ్, అనిల్, రామ్ నాయుడు, రవి, ధనరాజ్, సూర్య పాల్గని పెద్ద ఎత్తున కార్యక్రమం విజయవంతం చేశారు.