ఏయూ న్యాయ కళాశాలకు పుస్తకాల బహూకరణ

May 9,2024 00:10 #Books to Law college
Books to Law college

 ప్రజాశక్తి-విశాఖపట్నం : ఆంధ్రవిశ్వవిద్యాలయం న్యాయ కళాశాల విశ్రాంత ఆచార్యులు వి.కేశవరావు తాను రచించిన రెండు పుస్తకాలు ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌, ఇండియన్‌ కాంట్రాక్ట్‌ యాక్ట్‌ పుస్తకాలను న్యాయ కళాశాల గ్రంథాలయానికి బహూకరించారు. బుధవారం ఏయూ వీసీ ఆచార్య పివిజిడి.ప్రసాదరెడ్డిని కార్యాలయంలో కలుసుకుని ఆయన చేతుల మీదుగా న్యాయ కళాశాల ప్రిన్సిపల్‌ ఆచార్య వి.విజయలక్ష్మికి అందజేశారు. కార్యక్రమంలో ఆచార్య కె.సీతామాణిక్యం, తదితరులు పాల్గొన్నారు.

➡️