ప్రజాశక్తి-కొయ్యలగూడెం(ఏలూరు) : మండల కేంద్రంలో రాష్ట్ర, మండల, గ్రామ ఆటో ఒనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్, రాష్ట్ర ప్రభుత్వం మహిళకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించుతుంది అన్న వార్తతో వారు ఆందోళన చెందుతూ స్థానిక తహసిల్దర్ కి వినతిపత్రం అందజేశారు. ఆటో డ్రైవర్స్ మాట్లాడుతూ తాము ప్రభుత్వముపై ఆధారపడకుండా తమ యొక్క కుటుంబాలను పోషించుకుంటున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కుటుంబాలు ఈ యొక్క ఆటోలు నడుపుతూ జీవిస్తున్నారు. ముఖ్యంగా మహిళ ప్రయాణికులపై ఎక్కువ ఆధారపపడి ఉన్నామని, ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం తీసుకు వస్తుంది అన్న వార్తలు తమకు ఆందోళన కల్గిస్తుంది. ప్రభుత్వ పథకాలుకు తాము వ్యతిరేకం కాదని, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్న స్వాగతిస్తామని ఆటో డ్రైవర్స్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ప్రభుత్వాని కోరారు. ఈ కార్యక్రమంలో కొయ్యలగూడెం ఆటో జేఏసీ ప్రెసిడెంట్. షేక్ మొహిద్దిన్, సిరిగిరి మంగారావు మండల జేఏసీ ప్రధాన కార్యదర్శి, సొంగా శ్రీనివాస్ మండల జేఏసీ సభ్యులు,
కొల్లిపర సురేష్ మండల జేఏసీ సభ్యులు, గొర్రుముచ్చు చక్రవర్తి మండల జేఏసీ సభ్యులు, శంఖవరపు సుబ్బారావు మండల జేఏసీ సభ్యులు
పాల్గొన్నారు.