ప్రజాశక్తి-ఏలూరు స్పోర్ట్స్ : 75వ గణతంత్ర వేడుకలు జిల్లా గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ ముఖ్య అతిధిగా పాల్గొని మహాత్మా గాంధీ, డా. అంబేద్కర్ చిత్ర పఠానికి పూలమాలంకరణ చేసి నివాళులు అర్పించారు. అనంతరం త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి వందన సమర్పణ చేసారు. సందర్బంగా డీపీఓ విశ్వనాధ్ మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక భారత రాజ్యాంగం అన్నారు. గణతంత్ర స్ఫూర్తిని కొనసాగిస్తూ దేశాభివృద్ధికి కృషి చెయ్యాలని సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డి.యల్.పి.ఓ చంద్రశేఖర్, సిబ్బంది కిషోర్, సురేష్, సునీత, విజయ, పులి సత్యనారాయణ, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.