కొలనుకొండలో సిపిఎం నేతల విస్తృత ప్రచారం

కొలనుకొండ (గుంటూరు) : కొలనుకొండలో సిపిఎం మంగళగిరి శాసనసభ అభ్యర్థి జొన్న శివశంకరరావు మంగళవారం సిపిఎం నాయకులతో కలిసి విస్తఅత ప్రచారం నిర్వహించారు. గ్రామంలో స్థానిక సమస్యలపైన, ముస్లింలు, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్థానికులను వివరాలను అడిగి తెలుసుకుంటూ, సమస్యల పరిష్కారానికి ఎర్ర జెండాకే ఓటు వేయాలని ఆయన పేద ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం గుంటూరు జిల్లా నాయకులు బి.ముత్యాలరావు, సిపిఎం తాడేపల్లి మండల కార్యదర్శి దొంతి రెడ్డి వెంకటరెడ్డి, సిపిఎం మండల నాయకులు కాజా వెంకటేశ్వరరావు, పల్లె కఅష్ణ, సిపిఎం కొలనకొండ గ్రామ కార్యదర్శి కాట్రగడ్డ శివన్నారాయణ, కాట్రగడ్డ శ్రీనివాసరావు, గొట్టిపాటి కోటేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ సభ్యులు మెగావత్‌ వెంకటేశ్వరరావు నాయక్‌, కాట్రగడ్డ బాబు, కాట్రగడ్డ పూర్ణయ్య, సిపిఎం నాయకులు కంచర్ల జేమ్స్‌, కంచర్ల సాంబశివరావు, కారసాల సౌరి, కే స్వాతి తదితరులు పాల్గొన్నారు.

➡️