తహసీల్దార్‌ బి.మురళీ ముక్తేశ్వరరావుకు వీడ్కోలు సన్మానం

Feb 6,2024 12:47 #farewell, #Konaseema, #Tahsildar

ప్రజాశక్తి- రాజోలు (కోనసీమ) : అంకితభావంతో పనిచేసి ప్రజల మన్ననలను పొందడం గొప్ప విషయమని రాజోలు ఎంఎల్‌ఎ రాపాక వరప్రసాదరావు అన్నారు. మంగళవారం రాజోలు నుండి తణుకు బదిలీపై వెళ్తున్న తహసీల్దార్‌ బి.మురళీ ముక్తేశ్వరరావుకు వీడ్కోలు సన్మాన కార్యక్రమం రాజోలు సర్పంచ్‌ రేవు జ్యోతి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ రాపాక మాట్లాడుతూ … రాజోలు తహసిల్దార్‌ ముక్తేశ్వరరావు నాలుగున్నరేళ్లపాటు అత్యుత్తమ సేవలు అందించి అందరి ఆదరాభిమానాలు పొందారన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు, పట్టా పాసుపుస్తకాల జారీ, జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ, 2022 వరదలలో ఏటిగట్టు పటిష్ట, కరోనా సంక్షోభంలో కూడా మండల ప్రజలకు విశేష సేవలందించారని కొనియాడారు. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న తహసిల్దార్‌ తమ నియోజకవర్గం నుండి వెళ్లిపోవడం రాజోలు ప్రజలకు ఇష్టంలేదని, బదిలీలలో ఇలాంటివి తప్పవని ఎంఎల్‌ఎ అన్నారు. తహసిల్దార్‌ ముక్తేశ్వరావు మాట్లాడుతూ … తమ విధి నిర్వహణలో సహాయ సహకారాలు అందించిన రాజోలు మండల ప్రజా ప్రతినిధులకు, సిబ్బందికి ప్రజలకు కఅతజ్ఞతలు తెలిపారు. అనంతరం తహసిల్దార్‌ దంపతులకు పౌర సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్‌ఎ మానేపల్లి అయ్యాజీవేమా, ఎఎంసి చైర్మన్‌ రోజా రమణి, జెడ్పిటిసి మట్టా శైలజా, ఎంపిపి కేతా శ్రీనువాస్‌, కంచర్ల శేఖర్‌, డిప్యూటీ తహసీల్దారు శ్రీనివాస్‌, తెన్నెటి కిషోర్‌, సర్పంచ్‌ లు నక్కా రామారావు, కోటిపల్లి రత్నమాల, కట్టా శ్రీనివాస్‌, కడలి సత్యనారాయణ, చెల్లుబోయిన రాంబాబు, బోణం రమేష్‌, వివిధ గ్రామాల కార్యదర్శులు, విఆర్‌ఒలు, విఆర్‌ఎ లు, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

➡️