జోన్నవలసలో ఫ్లాగ్‌ మార్చ్‌

Mar 7,2024 15:15 #Police parade, #vijayanagaram

ప్రజాశక్తి-విజయనగరం కోట : రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా విజయనగరంలోని జాన్నవలసలో విజయనగరం రూరల్‌ సిఐ ఎం.శ్రీనివాసరావు, రూరల్‌ ఎస్‌ఐ ఆర్‌.వాసుదేవ్‌ ఆధ్వర్యంలో కేంద్ర పోలీసు బలగాలు, సివిల్‌ పోలీసులు ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత యుతంగా నిర్వహించేందుకు ప్రజలందరూ సహకరించాలని, అసాంఘిక శక్తులకు సహకరించ వద్దని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

➡️