ప్రజాశక్తి-శింగరాయకొండ : తనను ఆదరిస్తే అండగా ఉంటానని వైసిపి కొండపి నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివద్ధిశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు. పాలకుర్తి శ్రీనివాసరావు నివాసంలో ఎరుకుల ఆత్మీయ సమ్మేళనం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ దళిత, గిరిజనుల కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు తెలిపారు. తనను ఆదరిస్తే కొండపి నియోజక వర్గాన్ని అభివద్ధి పథంలో నడిపిస్తానని తెలిపారు. ఎరుకుల కులస్తులకు అండగా ఉంటానని తెలిపారు. పేదల సంక్షేమమే థ్యేయంగా సిఎం జగన్మోహన్రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం పాలకుర్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంత్రి ఆదిమూలపు సురేష్ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైసిపి వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బత్తుల అశోక్కుమార్రెడ్డి, వైసిపి మండల అధ్యక్షుడు సామంతుల రవికుమార్రెడ్డి, షేక్పటేల్, షేక్ అబ్దుల్లా, కట్టా రమేష్, పోలేరమ్మ, దాసు శ్రీను, యోగయ్య పాల్గొన్నారు.