ఏయూ విద్యార్థులకు అమెరికా సంస్థలో ఉద్యోగాలు

May 9,2024 00:08 #AU, #placements to America
AU, America, Placements

 ప్రజాశక్తి-విశాఖపట్నం : ఆంధ్రవిశ్వవిద్యాలయం విద్యార్థులు 24 మందికి అమెరికాకు చెందిన యునైట్‌ సంస్థలో ఉద్యోగాలు లభించాయి. ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల నుంచి 4, మహిళా ఇంజనీరింగ్‌ కళాశాల నుంచి 6, ఏయూ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగం నుంచి 14 మంది విద్యార్థులను ఈ సంస్థ ఎంపిక చేసింది. వీరికి ఏయూ వీసీ ఆచార్య పివిజిడి.ప్రసాదరెడ్డి సమక్షంలో యునైట్‌ సంస్థ వ్యవస్థాపకుడు శ్రీధర్‌ అబ్బవరం నియామక పత్రాలను అందజేశారు. ఇంజనీరింగ్‌ విద్యార్థులతో పోటీపడి ప్రతిభ చూపుతూ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగం విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం పట్ల సంతోషం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం.జేమ్స్‌స్టీఫెన్‌, విభాగాధిపతి ఆచార్య జి.వీర్రాజు, ప్లేస్‌మెంట్‌ అధికారులు విఆర్‌.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️