శిథిలాస్థితిలో స్మశాన వాటిక భవనం

Jun 29,2024 10:36 #Kakinada

ప్రజాశక్తి – తాళ్లరేవు : మండలం తాళ్లరేవు పంచాయతీ శ్రీ రంగనాయక పురం, గుత్తులవారిపాలెం గ్రామాలకు చెందిన స్మశాన వాటిక భవనం శిథిల స్థితికి చేరుకుంది. గుత్తులవారిపాలెం గ్రామం ఆత్రేయ ఉప కాలువ గట్టు చెంతన సుమారు 20 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ స్మశాన వాటిక భవనం పునాది భూమిలోకి కృంగిపోయింది. దీనివల్ల భవనం పిల్లర్స్ బీటలు తీసాయి. భవనం పైనుంచి స్లాబ్ పెచ్చులుగా ఊడి కింద పడిపోతుంది. పరిస్థితి ప్రమాదకరంగా ఉందని ఎప్పుడు కూలిపోతుందో తెలియక భయాందోళనకు గురవుతున్నామని శ్రీ రంగనాయక పురం, గుత్తులవారిపాలెం ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు గ్రామాలకు ఉన్న ఒకే ఒక స్మశాన వాటిక శిథిల స్థితికి చేరుకోవడంతో దాని స్థానంలో నూతన భవనం నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.

➡️