ప్రజాశక్తి – పెద్దాపురం
18 సంవ త్సరాల వయస్సు నిండిన యువత ఓటు హక్కు నమోదుతోపాటు ప్రతి ఒక్కరూ ఓటు వేసి ఓట ును సద్వినియోగం చేసు కోవాలని మోడల్ కోడ్ ఆప్ కాంటాక్ట్ (ఎంసిసి) కన్వీనర్ జి.ఉషారాణి సూచించారు. ఆదివారం మండలంలోని దివిలి కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల వసతి గృహా విద్యార్థులకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం జరిగే సార్వత్రిక ఎన్నికల్లో యువత అందరూ ఓట్లు వేసి ప్రజాస్వామ్య పరి రక్షణకు కృషి చేయాలన్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా పోలింగ్ శాతం పెంచేందుకు అందరూ కృషి చేయా లన్నారు. ఈ సందర్భంగా ఆమె ఓటింగ్ యంత్రాల పనితీరు, ఓటు వేసే విధానం తదితర అంశాలపై అవగాహన కల్పిం చారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఇఒపిఆర్డి ఎన్ సత్యనారాయణమూర్తి, పంచాయతీల కార్యదర్శులు, సచివాల యాల సిబ్బంది పాల్గొన్నారు.