ప్రజాశక్తి-అయినవిల్లి మండలంలోని విలస దుర్గ కాలనీ వాసులు తాగునీటి కోసం ఖాళీ బిందెలతో బుధవారం నిరసన తెలిపారు. అమలాపురం నుంచి ముక్తేశ్వరం వెళ్లే ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో రోడ్డుకు అడ్డంగా నిలబడి నిరసన తెలిపారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో అయినవిల్లి ఎస్ఐ రాజేష్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. సమస్య పరిష్కరించినందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసనకారులు ఆందోళన విరమించారు. వేసవికాలం కారణంగా కొన్ని రోజులుగా తాగునీరు అందకపోవడంతో నీటి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నామని పలుమార్లు పంచాయతీ అధికారులకుచ దృష్టికి తీసుకెళ్లినా తాగునీరు అందించేందుకు ఎటువంటి చర్యలూ తీసుకోలేదని తెలిపారు. తాగునీరు కొనుక్కుని తాగే పరిస్థితి నెలకొందని కనీసం తాగునీరు తాత్కాలికంగా అందించేందుకు అయినా చర్యలు చేపట్టలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులతో టిడిపి నాయకులు అక్కిశెట్టి దుర్గరావు మాట్లాడారు అధికారుల దృష్టికి తీసుకెళతానన్నారు.