టిడిపిలో పలువురి చేరిక

Apr 26,2024 21:43

 ప్రజాశక్తి – తెర్లాం : మండలంలోని గోపాలవలస, జగన్నాథవలస, టెక్కలి వలస, పెరుమాలి, మోదుగువలస గ్రామాల్లో శుక్రవారం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బేబినాయన ఎన్నికల ప్రచారం చేశారు. ఇందులో భాగంగా ఆయా గ్రామాల నాయకులు బుల్లి సూర్యనారాయణ, బారిక గణపతి, మామిడి రాంబాబు ఆధ్వర్యంలో సుమారు 350 కుటుంబాలు జగన్నాధవలస మామిడి రాంబాబు ఆధ్వర్యంలో సుమారు 50 కుటుంబాలు పార్టీలో చేరాయి. వీరందరికీ బేబీ నాయన కండువాలేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు వెంకటనాయుడు, నాయకులు వెంకటేష్‌, ఆనందరావు, అప్పల నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు.

➡️