శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు

Apr 28,2024 21:30

ప్రజాశక్తి – వత్సవాయి : గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గౌరవ నందిగామ ఎసిపి డాక్టర్‌ రవికిరణ్‌ హెచ్చరించారు. శనివారం మండలంలోని చిట్యాల గ్రామంలో ఎన్నికల సందర్భంగా ప్రజలు పాటించాల్సిన విధివిధానాలు, చట్టాలపై అవగాహన కల్పించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంత వాతావరణం కలిగి ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వత్సవాయి ఎస్‌ఐ అభిమన్య, తదితరులు పాల్గొన్నారు.

➡️