ప్రజాశక్తి – వన్టౌన్ : విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మైనార్టీ నాయకుడు ఎంఎస్.బేగ్ గృహంలో ఎన్నికల అధికారులు, పోలీసులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రెండు బృందాలుగా ఎమ్.ఎస్.బేగ్ గృహం, కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా బేగ్ మాట్లాడుతూ తమ ఇమేజ్ దెబ్బకొట్టాలనే ఇలా ఎన్నికల అధికారులకు వైసిపి నాయకులు తప్పుడు ఫిర్యాదు చేసి ఉంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తనిఖీలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా మైనారిటీ నాయకుడు మీద దాడిగా అభివర్ణించారు. తన కుటుంబం నీతి నిజాయితీలకు మారుపేరుగా నిలిచిందని, ఈ మాట పశ్చిమ నియోజకవర్గంలో ఎవరిని అడిగా చెప్తారని అన్నారు.