సిపి ఎస్ ఉద్యోగులపై పోలీసులు నిర్భంధం

Feb 17,2024 16:56 #vijayanagaram
  • చలో విజయవాడ కు వెళ్లనీయకుండా గృహనిర్బంధం,అరెస్టులు చేస్తున్న పోలీసులు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఓట్ ఫర్ సిపీఎస్, సిపిఎస్ మాకొద్దు, ఓ పి ఎస్ కావాలంటూ ఎపి సి పి ఎస్ ఉద్యోగులు 18 న తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేసే పనిలో పడ్డారు.శనివారం సి పీ ఎస్ ఉద్యోగ సంఘాల నాయకులు ఇళ్లకు వెళ్లి నోటీసులు ఇచ్చి,చలో విజయవాడ కు వెళ్లనీయకుండా గృహ నిర్భంధం,అరెస్టులు చేస్తున్నారు.శనివారం గంటా శ్రీనివాస,మరి కొంతమంది ఉద్యోగులు ఇళ్లకు వెళ్లి నోటీసులు ఇచ్చి అరెస్టులు చేశారు. ఈ సందర్భంగా సిపి ఎస్ ఎంప్లాయిస్ సంఘం జిల్లా కార్యదర్శి ఎం.శ్రీరాములు, రాష్ట్ర మీడియా ఇంచార్జీ గంటా.శ్రీనివాసరావు లు మాట్లాడుతూ ఓట్ ఫర్ ఓపిఎస్ చలో విజయవాడ ప్రోగ్రాం కి వెళ్లకుండా గృహ నిర్బందం అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు. జిల్లాలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులందరూ విజయవాడలో జరిగే ఓట్ ఫర్ ఓపిఎస్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి తీరుతామన్నారు.

➡️