ప్రజాశక్తి – పొన్నూరు (గుంటూరు) : పొన్నూరు నియోజకవర్గ పరిధిలో ఈ నెల 18 నుండి 25 వ తారీఖు వరకు దాఖలైన వివిధ పార్టీల నామినేషన్ ల పరిశీలన శుక్రవారం ఆర్ ఓ కార్యాలయంలో నిర్వహించారు. పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు ఐఎఎస్ అధికారులు నీరజ్ కుమార్ పర్యవేక్షణ లో రిటర్నింగ్ అధికారి లక్ష్మి కుమారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రథమ పార్టీల అయిన అభ్యర్డులైన అంబటి మురళి కఅష్ణ (వైసిపి), ధూళిపాలా.నరేంద్రకుమార్ (టిడిపి ), జక్కా.రవీంద్రనాద్ (కాంగ్రెస్)లతో పాటు పలువురు అభ్యర్థులు పాల్గొన్నారు.