కురుపాం (మన్యం) : కురుపాంలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ను ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, అధికారులు కలిసి మంగళవారం ప్రారంభించారు. కురుపాంలో రూ.2 కోట్ల 50 లక్షలతో నిర్మించిన పోలీస్ స్టేషన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీ వాణి, విశాఖ డి.ఐ.జి విశాల్ గున్ని, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, జిల్లా వైసీపీ అధ్యక్షుడు పరిక్షిత్ రాజు, తదితరులు పాల్గొన్నారు.