జగన్‌ కుట్రలను భగం చేస్తాం రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్‌గాడ్రగ్సాంధ్ర ప్రదేశ్‌ గా మార్చేందుకు జగన్‌ సిద్ధంరేణిగుంట బహిరంగ సభలో బాలయ్య ఫైర్‌

జగన్‌ కుట్రలను భగం చేస్తాం రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్‌గాడ్రగ్సాంధ్ర ప్రదేశ్‌ గా మార్చేందుకు జగన్‌ సిద్ధంరేణిగుంట బహిరంగ సభలో బాలయ్య ఫైర్‌

జగన్‌ కుట్రలను భగం చేస్తాం రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్‌గాడ్రగ్సాంధ్ర ప్రదేశ్‌ గా మార్చేందుకు జగన్‌ సిద్ధంరేణిగుంట బహిరంగ సభలో బాలయ్య ఫైర్‌ప్రజాశక్తి-శ్రీకాళహస్తి రానున్న ఎన్నికల్లో జగన్‌ టక్కు టమార.. గజకర్ణ గోకర్ణ.. కుట్రలన్నిటినీ భగం చేస్తామని హిందూపురం ఎమ్మెల్యే, టిడిపి, జనసేన, బిజెపి కూటమి స్టార్‌ క్యాంపెయినర్‌ నందమూరి బాలకష్ణ స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్‌గా, డ్రగ్సాంధ్ర ప్రదేశ్‌గా మార్చేందుకు జగన్‌ ‘సిద్ధం’గా ఉన్నాడంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలకష్ణ ఆదివారం రాత్రి తిరుపతి జిల్లా రేణిగుంట పట్టణంలో రోడ్‌ షో నిర్వహించారు. అక్కడ నిర్వహించిన భారీ బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడారు. జగన్‌ సిద్ధం.. సిద్ధం.. అంటూ సభలెందుకు పెడుతున్నాడో జనాలకు అర్థం కావట్లేదని విమర్శలు చేశారు. సిద్ధం సభలకు రూ.1600 కోట్ల ప్రజాధనాన్ని వధా చేశాడంటూ ఆరోపణ చేశారు. రాష్ట్రంలో మద్యాన్ని నిర్మూలించేందుకు జగన్‌ సిద్ధమా అని ప్రశ్నించారు. యువతకు ఉద్యోగాలు ఇచ్చేందుకు జగన్‌ సిద్ధమా..!! అన్నారు. అమరావతి రైతులకు న్యాయం చేసేందుకు జగన్‌ సిద్ధమా..! అంటూ ఎద్దేవా చేశారు. తల్లికి..చెల్లికి.. బాబారుకి న్యాయం చేసేందుకు నువ్వు సిద్ధమా అంటూ సవాలు విసిరారు. ముఖ్యంగా నాసిరకమైన మద్యం, డ్రగ్స్‌ కు అలవాటు పడి జీవితాలు కోల్పోతున్న యువతకు జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించేందుకు నువ్వు సిద్ధమా జగన్‌ అంటూ ప్రశ్నించారు. ఇవన్నీ చేయలేని నువ్వు ప్రజల్ని దేనికి సిద్ధం కావాలని పిలుపునిస్తున్నావో చెప్పాలని ప్రశ్నించారు. తెలుగు ప్రజల ఆకాంక్షల మేరకు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ టిడిపిని స్థాపించారని గుర్తు చేశారు. టిడిపి పార్టీ కాదనీ, ప్రజల ఆస్తి అని వెల్లడించారు. టిడిపికి ఉన్న కార్యకర్తల సంఖ్య ప్రపంచంలో ఏ పార్టీకి లేదని కితాబిచ్చారు. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో ఎన్టీఆర్‌ టిడిపిని స్థాపించారనీ, 9 నెలల కాలంలోనే అధికారంలోకి తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఎన్టీఆర్‌ హయాంలో ప్రపంచమే గర్వించదగ్గ సంస్కరణలను టీడీపీ తీసుకొచ్చిందన్నారు. మహిళలకు ఆస్తిలో వాటా, భూమిశిస్తు రద్దు, రూ.1కే బియ్యం, తెలుగు ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టులు ముఖ్యమైనవని వివరించారు. ఆయన వారసుడిగా టిడిపి సారధ్య బాధ్యతలు చేపట్టిన మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు విజన్‌ ఉన్న నాయకుడని కొనియాడారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ఇతర రాష్ట్రాలతో పోటీపడిందనీ, అయితే జగన్‌ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడంటూ మండిపడ్డారు. గాడి తప్పిన రాష్ట్ర అభివద్ధిని తిరిగి అభివద్ధి పథం పట్టించాలంటే అది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికి సాధ్యపడుతుందని వివరించారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎంపీ అభ్యర్థి వరప్రసాద్‌, ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్‌ రెడ్డి పాల్గొన్నారు.

➡️