చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే నాయకర్

Jun 29,2024 12:24 #West Godavari District

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమగోదావరి జిల్లా): మండలంలోని లక్ష్మణేశ్వరం గ్రామంలోని కుళాయి చెరువును శనివారం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పరిశీలించారు. తాగునీటిని పరిశీలించి ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు అందించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యుఎస్ ఏఈ లోకేష్ ని ఆదేశించారు. అనంతరం లక్ష్మణేశ్వరం చెరువు పక్కన ఉన్న కాలనీని పరిశీలించారు. స్థానిక సమస్యలను ఎమ్మెల్యే నాయకర్ కు దృష్టికి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాగంటి మురళీ కృష్ణ వివరించారు. తాగునీరు, విధి దీపాలు, పారిశుధ్య సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పరిష్కరిస్తానని ప్రజలకు నాయకర్ భరోసా ఇచ్చారు

➡️