చెత్త తరలింపు అడ్డుకున్న కార్మికులు

ప్రజాశక్తి అనంతపురం కార్పొరేషన్‌ : నగరంలోని కొత్త ఊరిలో మొదటి రోడ్డు ట్యాంకు వద్ద చెత్తాచెదారాలను జెసిబి యంత్రాలతో ఎక్కించే ట్రాక్టర్ల ద్వారా తరలించాలన్న ప్రయత్నాలను గురువారం మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘం నాయకులు అడ్డుకున్నారు. చెత్త తరలించకుండా చెత్తకుప్పలపై కార్మికులు బైఠాయించి.. నినాదాలు చేశారు. అధికారుల వైఖరిని వారు తప్పు పట్టారు. చెత్తను యంత్రాలతో ఎత్తించాలని చూస్తే అడ్డుకుంటామని హెచ్చరించార. ఈ సందర్భంగా నాయకులు తిరుమలేష్‌ మాట్లాడుతూ.. లక్షలాది రూపాయలు వెచ్చించి అద్దెకు యంత్రాలు ట్రాక్టర్లు తెప్పించి చెత్త తరలించే బదులు కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి ఆ నిధులు వెచ్చిస్తే బాగుండేదన్నారు. కార్పొరేషన్‌ అధికారులు కార్మికుల ఉద్యమాన్ని దెబ్బతీసేలా వారు కడుపు కొట్టే చర్యలు పాల్పడితే సహించబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రెండో పట్టణ కార్యదర్శి, ముర్తుజా, గురురాజా, బత్తల ఆదినారాయణ, ఎం ఆది, ముత్తు, రాజు, తదితరులు పాల్గొన్నారు.

➡️