‘పశ్చిమం’లో వైసిపి ప్రచారం

పిల్లా రమాకుమారి

ప్రజాశక్తి -గోపాలపట్నం : జివిఎంసి 62వ వార్డు కార్పొరేటర్‌ పల్లా లక్ష్మణరావు ఆధ్వర్యాన పశ్చిమ నియోజకవర్గ పరిధి దుర్గానగర్‌లో యలమంచిలి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పిల్లా రమాకుమారి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్తున్న రమాకుమారికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆనంద్‌కుమార్‌ను ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిపించి అవకాశం కల్పిస్తే ఐదేళ్లు మీకు సేవలు అందిస్తారని తెలిపారు. ఎంపీగా బొత్స ఝాన్సీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 62వ వార్డు వైసిపి అధ్యక్షులు బీశెట్టి గణేష్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.నందమూరినగర్‌లో ప్రచారం ఆడారి ఆనంద్‌కుమార్‌ విజయాన్ని కాంక్షిస్తూ జివిఎంసి 92వ వార్డు పరిధి నందమూరినగర్‌లో వైసిపి మండల అధ్యక్షులు బెహరా భాస్కరరావు ఆధ్వర్యాన ఎన్నికల ప్రచార నిర్వహించారు. ఎమ్మెల్యేగా ఆనంద్‌కుమార్‌ను, విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సీలక్ష్మిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.62వ వార్డులో ప్రచారం నిర్వహిస్తున్న రమాకుమారి

➡️