సుహాస్ నటిస్తున్న తాజా ప్రాజెక్టు ‘ప్రసన్న వదనం’. ఈ సినిమాకు అర్జున్ వైకే దర్శకత్వం వహిస్తున్నారు. పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మే 3న ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్రబృందం ప్రకటించింది. లిటిల్ థాట్స్ సినిమాస్, అర్హ మీడియా బ్యానర్పై జెఎస్.మణికంఠ, టిఆర్.ప్రసాద్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఫేస్ బ్లైండ్నెస్ అనే వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి ఒక సమస్య ఎదురవుతుంది. ఇక ఆ సమస్య నుంచి అతడు ఎలా బయటపడ్డాడు అనేది ఈ సినిమా స్టోరీ.