రామ్‌ చరణ్‌కు డాక్టరేట్‌ ప్రకటించిన చెన్నై వేల్స్‌ యూనివర్సిటీ

Apr 11,2024 17:31 #New Movies Updates, #Ram Charan

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ఖాతాలో మరో ఘనత చేరనుంది. చెన్నైలోని వేల్స్‌ వర్చువల్‌ యూనివర్సిటీ రామ్‌ చరణ్‌కు గౌరవ డాక్టరేట్‌ ప్రకటించింది. ఏప్రిల్‌ 13న చెన్నైలోని పల్లవరంలో వేల్స్‌ వర్సిటీ స్నాతకోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి రామ్‌ చరణ్‌ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఏఐసీటీఈ అధ్యక్షుడు డీజీ సీతారాం.. రామ్‌ చరణ్‌కు డాక్టరేట్‌ ప్రదానం చేయనున్నారు. కాగా, ఇదే వేల్స్‌ యూనివర్సిటీ ఈ ఏడాది జనవరిలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌కు కూడా డాక్టరేట్‌ ప్రకటించింది. అయితే, వివిధ రంగాల్లో రాణించిన వారు తనకంటే ఎక్కువ మంది ఉన్నారని.. తాను ఈ డాక్టరేట్‌ను స్వీకరించలేనని పవన్‌ సున్నితంగా తిరస్కరించారు. అంతేకాదు, ఎన్నికల హడావిడి కారణంగా వర్సిటీ స్నాతకోత్సవానికి కూడా హాజరు కాలేనని తెలిపారు.

➡️