నయనతార, నివిన్ పౌలీ జంటగా నటిస్తున్న వినోదాత్మక చిత్రం ‘డియర్ స్టూడెంట్స్. సందీప్ కుమార్, జార్జ్ ఫిలిప్రారు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని నయన్ సామాజిక మాధ్యమాల వేదికగా తెలిపింది. నివిన్, నయన జంటగా 2019లో వచ్చిన ‘లవ్ యాక్షన్ డ్రామా’ ప్రేక్షకుల్ని అలరించింది. ఇన్నేళ్లకు మళ్లీ ఈ జోడీ నటిస్తున్న ‘డియర్ స్టూడెంట్స్’ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో నయనతార టీచర్గా కనిపించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈమె నటించిన ‘టెస్ట్’ విడుదలకు సిద్ధంగా ఉంది.