సార్వత్రిక ఎన్నికల్లో ఐదోవిడత ఎన్నికల నోటిఫికేషన్ను శుక్రవారం కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసింది. ఈ దశలో ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలలోని 49 లోక్సభ స్థానాలకు మే 20న పోలింగ్ జరుగుతుంది. నోటిఫికేషన్ విడుదలైన ఏప్రిల్ 26 నుంచి మే 3 వరకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేసుకునేందుకు ఇసి గడువు నిచ్చింది. మే 4న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి తేదీ మే 6. బీహార్లో ఐదు స్థానాలు, జార్ఖండ్లో మూడు స్థానాలు, మహారాష్ట్రలో 13 స్థానాలు, ఒడిశాలో ఐదు, ఉత్తరప్రదేశ్లో 14, పశ్చిమబెంగాల్లో ఏడు, జమ్మూకాశ్మీర్లో ఒకటి, లడఖ్లో ఒక స్థానానికి ఓటింగ్ నిర్వహించనున్నారు.