– కోటి రూపాయలు స్వాధీనం
-300 మద్యం బాటిళ్లు పట్టివేత
ప్రజాశక్తి – యంత్రాంగం:సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎక్కడికక్కడ అక్రమ నగదు సరఫరాను అధికారులు అడ్డుకుంటున్నారు. అధిక మొత్తంలో తరలిస్తున్న డబ్బును, మద్యం, ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుంటున్నారు. ఎన్టిఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండం గొల్లపూడిలో నోట్ల డంప్ దొరికింది. బిజెపి, జనసేన బలపరచిన టిడిపి మైలవరం అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ అనచరుడు అలూరు సురేష్ ఇంట్లో బుధవారం పోలీసులు, ఎన్నికల అధికారులు తనిఖీలు నిర్వహించారు. కోటి రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలు చూపకపోవడంతో సీజ్ చేశారు.
జగ్గయ్యపేట మండలం రామచంద్రునిపేటలో 300 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణానికి చెందిన పగిడిపర్తి రాము అనే వ్యక్తి కోదాడ నుండి షేర్ మహమ్మద్పేటకు ఆటోలో మద్యం బాటిళ్లను తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. అతని వద్ద నుండి మద్యం బాటిళ్లు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు.