పూణె : మంగళవారం జరిగిన మూడో దశ పోలింగ్ సందర్భంగా పూణెలో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. అభ్యర్థి గెలుపు కోసం ఏకంగా మహిళా కమిషన్ అధ్యక్షురాలు ఇవిఎంకు పూజలు చేసి వార్తల్లో నిలిచారు. పూణెలోని ఖక్వాస్లా ప్రాంతంలోని పోలింగ్ కేంద్రానికి మహారాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు రూపాలి చకంకర్ హారతి పళ్లెంతో వెళ్లి ఇవిఎంకు పూజలు చేశారు. దీంతో స్థానిక ఎన్నికల అధికారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమెపై సంహగఢ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా రూపాలీ మహారాష్ట్ర డిప్యూటీ సిఎం అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్కి మద్దతుగా ప్రచారం చేశారు.