-కాంగ్రెస్- జోడెద్దులనుంచి హస్తానికి
– బిజెపి- దీపం నుంచి కమలానికి
-75 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం
ప్రస్తుతం ఒకటి అధికార పక్షం… ఇరకొకటి ప్రతిపక్షం… అవే భారతీయ జనతాపార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఎన్నికల్లో తమతమ గుర్తులను జనంలోకి తీసికెళ్లేందుకు అనునిత్యం ప్రయత్నిస్తూనే ఉన్నాయి. అయితే ఆ పార్టీల ఎన్నికల చిహ్నాల వెనుక పెద్ద చరిత్రే ఉంది. 75 ఏళ్ల భారతదేశ రాజకీయ చరిత్రలో ఈ రెండు పార్టీల గుర్తుల్లో పెను మార్పులు చేసుకున్నాయి. బిజెపి అయితే తొలుత దీపం గుర్తుతో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించగా, కాంగ్రెస్ పార్టీ జోడెద్దులు-నాగలి గుర్తుతో ఎన్నికల ప్రయాణానికి అంకురార్పణ కావించింది.
కాంగ్రెస్
కాంగ్రెస్ విషయానికి వస్తే 1952 సంవత్సరం నుంచి నాగలితో కూడిన జోడెద్దుల గుర్తును తమ పార్టీ సింబల్గా చేసుకుని ఎన్నికల్లో నిలిచిరది. అయితే దిరాగారధీ నేతృత్వంలో ఇరడియన్ నేషనల్ కాంగ్రెస్-ఆర్ (రిక్విజిషనలిస్ట్)గా మారిరది. దీనినే కొద్దికాలం ఐఎన్సి-ఓ (ఆర్గనైజేషన్)గా కూడా పిలిచారు. పాత పార్టీలో మిగిలిపోయన కొరతమంది జోడెద్దులను గుర్తుగా కొనసాగిరచుకోగా, ఇరదిరా గాంధీ కాంగ్రెస్ ఆవు-దూడను గుర్తుగా మార్చుకుంది. 1971 ఎన్నికల్లోఇందిర అధ్వర్యంలో ఏకంగా 352 లోక్సభ స్థానాల్లో విజయం సాధిరచిరది. అలాగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీలలో కూడా ఆ పార్టీ జెరడా రెపరెపలాడిరది. ఆ తరువాత తన పార్టీని కాంగ్రెస్ (ఐ)గా మార్చుకుని 1977 ఎన్నికల బరిలోకి దిగారు. కాలక్రమేణా ఇదే పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్సి)గా రూపాంతరం చెంది హస్తం గుర్తుకి మారింది. ఇలా 1952నుంచి 72 సంవత్సరాల ప్రయాణంలో మూడు గుర్తులను మార్చుకుంది.
బిజెపి
బిజెపి విషయానికి వస్తే ఆ పార్టీ కూడా తన రాజకీయ గమనంలో మూడు సార్లు గర్తులను మార్చుకుంది. 1951లో భారతీయ జనసంఘ్ పేరుతో ఉన్న ఆ పార్టీ వెలుగుతున్న నూనె దీపం గుర్తును కలిగి ఉరది. 1977 వరకు ఇదే గుర్తు కొనసాగగా, 1977లో ఇతర పార్టీలతో కలిపి జనతా పార్టీగా అవతరించింది. దీరతో దీని గుర్తు కూడా మారి నాగలి పట్టిన రైతు సింబల్తో తెరపైకి వచ్చిరది. ఆ తరువాత మూడేళ్ల అనంతరం జనతాపార్టీని రద్దు చేయడంతో బిజెపి ఏర్పాటైంది. అప్పటి నుంచే ఆ పార్టీ కమలం సింబల్తో ఎన్నికల్లో పోటీ చేస్తోంది. రెరడు జాతీయ పార్టీలు తమ గుర్తుల ప్రస్తానంలో పలు మార్పులు చేసుకొని కాంగ్రెస్ హస్తం, బిజెపి కమలం సింబల్పై 2024 సార్వత్రిక ఎన్నికల బరిలోకి దిగాయి.
పటౌడి