లాహోర్: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పిసిబి) 2025 ఛాంపియన్స్ ట్రోఫీ వేదికలను ప్రకటించింది. కరాచీ, లాహోర్, రావల్పిండిలో మ్యాచ్లు నిర్వహించనున్నట్లు పిసిబి చీఫ్ మొహ్సిన్ నఖ్వీ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. చివరిసారిగా 2017లో నిర్వహించిన చాంపియన్స్ ట్రోఫీకి ఇంగ్లండ్లో జరిగింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో చాంపియన్స్ ట్రోఫీ జరుగనుంది. ఈ మెగా టోర్నీ కంటే ముందు టి20 వరల్డ్ కప్లో జూన్ 9న భారత్, పాక్లు తలపడనున్నాయి.