న్యూఢిల్లీ : మరో ముగ్గురు ప్రతిపక్ష ఎంపిలపై లోక్సభ శుక్రవారం సస్పెన్షన్ వేటు వేసింది. అనైతిక ప్రవర్తన పేరుతో మరో ముగ్గురిని లోక్సభ స్పీకర్ సస్పెండ్ చేశారు. దీంతో సస్పెండ్కు గురైన మొత్తం లోక్సభ ఎంపిల సంఖ్య 146కి చేరింది. లోక్సభ నుండి మొత్తం 100 మంది సస్పెండ్ కాగా, రాజ్యసభ నుండి 46 మంది బహిష్కరణకు గురయ్యారు.