విద్యుత్‌ వాహనం అగ్నికి ఆహుతి

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి) : నరసాపురం పట్టణంలో మంగళవారం రాత్రి విద్యుత్‌ వాహనం అగ్నికి ఆహుతి అయింది. దీనికి సంబంధించి ఫైర్‌ ఆఫీసర్‌ కె. భాస్కర రామం తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. నరసాపురం పట్టణానికి చెందిన పి. శ్రీనివాస్‌ బట్టల షాప్‌ లో పనిచేస్తాడు. స్టీమర్‌ రోడ్‌ లోని వైఎస్‌ఆర్‌ విగ్రహం వద్ద ఎప్పటిలాగే బైక్‌ను పార్కు చేసి ఉంచారు. పార్కింగ్‌ చేసి ఉన్న బండి లోనుండి మంటలు వచ్చి అగ్నికి ఆహుతి అయిపోయింది. స్థానికులు గమనించి ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేశారు లేకపోతే పక్కన ఉన్న వాహనాలు కూడా అగ్నికి ఆహుతి అయ్యేవని స్థానికులు తెలిపారు. బ్యాటరీ బైక్‌ పూర్తిగా దహనమయ్యింది.

➡️