బీజింగ్ : భారత నూతన రాయబారిగా సీనియర్ దౌత్యవేత్త జు ఫీహాంగ్ నియమితులయ్యారు. అయితే ఈ నియామకంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. ఆఫ్ఘనిస్థాన్, రొమేనియాల మాజీ రాయబారి జు ఫీహాంగ్ను భారత్ నూతన రాయబారిగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ నియమించినట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆయన త్వరలోనే ఢిల్లీచేరుకోనున్నట్లు సమాచారం.
భారత్ రాయబారిగా చౌనా దౌత్యవేత్త సన్ వీడాంగ్ పదవీకాలం 2022 అక్టోబర్తో ముగిసింది. 18 నెలల అనంతరం జు ఫీహాంగ్ భారత నూతన రాయబారిగా బాధ్యతలు చేపట్టనున్నారు.