బెంగళూరులో ఆరు చోట్ల ఎన్‌ఐఏ సోదాలు

Dec 13,2023 13:07 #Bengaluru, #ED investigation, #NIA

బెంగళూరు: కర్ణాటకలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) సోదాలు నిర్వహిస్తోంది. బెంగళూరులో దాదాపు ఆరు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు పాల్పడేందుకు ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ కుట్ర పన్నిందన్న సమాచారంతోనే జాతీయ దర్యాప్తు సంస్థ ఈ దాడులు చేపడుతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రోజులు క్రితం.. మహారాష్ట్ర, కర్ణాటకల్లోని 44 ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు జరిపి.. ఐసిస్‌ మాడ్యూల్‌ నాయకుడితో సహా మొత్తం 15 మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని పడఘా – బోరివలీ, ఠాణె, పుణె.. అటు కర్ణాటకలోని బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఏకకాలంలో ఎన్‌ఐఏ బృందాలు సోదాలు నిర్వహించి భారీ మొత్తంలో లెక్కలోకి రాని నగదు, తుపాకులు, ఇతర ఆయుధాలు, కొన్ని పత్రాలు, స్మార్ట్‌ ఫోన్లు, డిజిటల్‌ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

➡️