బెంగళూరు : బిజెపి అధ్యక్షుడు జె.పి. నడ్డాకు బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ బుధవారం నోటీసులిచ్చారు. బిజెపి ఐటి హెడ్ అమిత్ మాలవీయాకు కూడా సమన్లు జారీ చేశారు. వారం రోజుల్లోగా బెంగళూరు పోలీసుల ఎదుట హాజరవ్వాలని ఆదేశించారు. కాంగ్రెస్ ఫిర్యాదు మేరకు నడ్డా, అమిత్ మాలవియా, కర్ణాటక బిజెపి చీఫ్ విజయేంద్రలపై బెంగళూరులోని హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైన సంగతి తెలిసిందే.
ఈ వివాదాస్పద పోస్టును తొలగించాలంటూ ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఎక్స్ని ఆదేశించింది. కర్ణాటకలో అన్ని లోక్సభ స్థానాలకు మంగళవారం పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముగిసిన ఒక రోజు తర్వాత ఈ నోటీసులు రావడం గమనార్హం.