న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్ ఇంట్లో సోదాలు చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తోపాటు ఆప్ పార్టీకి చెందిన ప్రధాన నాయకులను అరెస్టు చేసింది. రెండు రోజుల క్రితం అరెస్టయిన కేజ్రీవాల్కు ఢిల్లీ కోర్టు వారం రోజులు కస్టడీ విధించిన విషయం తెలిసిందే.