జమ్మూ : జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళుతున్న ట్యాక్సీ వాహనం రాంబన్ ప్రాంతానికి సమీపంలో అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో 10 మంది మృతి చెందినట్లు సమాచారం. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్), సివిల్ క్విక్ రెస్పాన్స్ టీమ్ (క్యూఆర్టీ) ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.