Food poisoning: 47 మంది విద్యార్థులకు అస్వస్థత

బెంగళూరు : బెంగళూరు మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లోని బాలికల హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌ జరిగింది. దీంతో 47 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సిబ్బంది బాధిత విద్యార్థిలను గ్యాస్ట్రో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌, డాక్టర్‌ రమేష్‌ కృష్ణ మాట్లాడుతూ.. ఫుడ్‌ పాయిజన్‌ లేదా డయేరియా అనేది ఇంకా నిర్ధారణ కాలేదని తెలిపారు. టెస్టు రిపోర్టులు రాగానే కారణం ఏంటి అనేది తెలుస్తుందన్నారు. ప్రస్తుతం విద్యార్థినులు కోలుకుంటున్నారని వెల్లడించారు. మరోవైపు విద్యార్థినుల తల్లిదండ్రుల ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్‌ చేస్తున్నారు. తమ పిల్లలు అస్వస్థతకు కారణమేంటో చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు.

➡️