రూ.8.3 కోట్లు ఇవ్వండి లేకపోతే ఎయిర్‌పోర్టును పేల్చేస్తా : మెయిల్‌ ద్వారా బెదిరింపు

Nov 25,2023 12:35 #airport, #Crores, #Give, #mail

ముంబయి : ముంబయిలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్‌ 2 ను పేల్చిస్తామంటూ … బెదిరింపు ఈమెయిల్‌ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. బెదిరింపు మెయిల్‌ నేపథ్యంలో … విమానాశ్రయంలో భద్రతను పటిష్ఠం చేశారు. ప్రాథమిక విచారణలో ఈమెయిల్‌ పంపిన ఇంటర్నెట్‌ ప్రోటోకాల్‌ (ఐసి) చిరునామాను పోలీసులు ట్రాక్‌ చేశారు. పోలీస్‌ సైబర్‌ విభాగం మెయిల్‌ లొకేషన్‌ను గుర్తించినట్లు సమచారం. quaidacasrol@gmail.com ద్వారా బెదిరింపు ఈమెయిల్‌ పంపిన గుర్తు తెలియని వ్యక్తిపై సహార్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ ఫీడ్‌బ్యాక్‌ ఇన్‌బాక్స్‌కు మెయిల్‌ వచ్చినట్లు తెలిసింది. ‘బిట్‌కాయిన్‌లో 1 మిలియన్‌ డాలర్లు (రూ.8.3 కోట్లు) బదిలీ చేయకపోతే 48 గంటల్లో టెర్మినల్‌ 2ను పేల్చేస్తాం. 24 గంటల తర్వాత మరొక హెచ్చరిక ఉంటుంది’ అని మెయిల్‌ వచ్చింది. మెయిల్‌ ద్వారా బెదిరించిన దుండగుడిపై ఐపిసి సెక్షన్లు 385 (బలవంతపు వసూళ్లు), 505(1)(బి) (ప్రజల్లో భయాందోళనలు కలిగించే ప్రకటనలు చేయడం) కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

➡️