గాంధీనగర్ : నీట్ (యుజి) స్కామ్లో గుజరాత్లోని అనేక ప్రాంతాల్లో సిబిఐ శనివారం సోదాలు నిర్వహించింది. గోధ్రా, అహ్మదాబాద్, ఖేద, అనంద్ జిల్లాల్లోని వివిధ ప్రదేశాల్లో ఈ సోదాలు జరిగాయి. ఈ కేసులో మరొక నిందితుడు, జార్ఖండ్లోని హజరిబాగ్కు చెందిన ఒక హిందీ దినపత్రిక జర్నలిస్టు జమాలుద్దీన్ను అరెస్టు చేసినట్లు సిబిఐ శనివారం తెలిపింది. పేపర్ లీక్ వ్యవహారంలో బీహార్లోని ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్కు సహాయం చేసాడనే ఆరోపణలతో జమాలుద్దీన్ను అరెస్టు చేసినట్లు తెలిపింది. గుజరాత్లోని గోద్రాలో ఒక పరీక్షా సెంటర్లో కాపీ జరిగిందనే ఆరోపణలతో ఐదుగురిని గుజరాత్ పోలీసులు ఈ నెల 14న అరెస్టు చేశారు. వీరిలో ఒక కోచింగ్ సెంటర్ అధిపతి కూడా ఉన్నాడు. అలాగే గుజరాత్లోని వడోదరలో నిర్వహించే ఒక కోచింగ్ సెంటర్ కూడా ఈ స్కామ్లో భాగముందని ఆరోపణలు ఉన్నాయి.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/06/cbi-copy.jpg)