ఇంటర్నెట్ : ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బిజెపి చేసిన అవినీతిపై ప్రతిపక్షాలతో అనేక మంది మేధావులు, ప్రముఖులు తమ విమర్శ గళాన్ని వినిపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సుప్రీం కోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈడీ, సిబిఐ, ఐటిలను ఉపయోగించి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా దోపిడీ చేశారని విమర్శించారు. ఇదొక చెత్త రకమైన అవినీతి అని ఆయన పేర్కొన్నారు. కార్పోరేట్ కంపెనీల ఇచ్చిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలతో కూడిన వార్త సమాచారాన్ని ఆయన పోస్టుకు జతచేశారు.