లక్నో : యుపిలో పదవ తరగతి బోర్డ్ పరీక్షల్లో 98.5 శాతం మార్కులతో అగ్రస్థానంలో నిలిచిన ప్రాచీ నిగమ్ ఆదివారం తనపై వస్తున్న ట్రోల్స్పై ఘాటుగా స్పందించారు. తన రూపాన్ని కాదు .. పరీక్షల్లో తాను సాధించిన మార్కుల్ని చూడాలని అన్నారు. ” నా ముఖంపై అవాంఛిత రోమాలు ఉండటం వల్ల నన్ను ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే నా రూపాన్ని కాదు.. మార్కుల్ని చూడండి” అని బదులిచ్చారు. ”చాణక్యుడు కూడా వేధింపులకు గురయ్యారు. కానీ అవి అతనిపై ప్రభావం చూపలేకపోయాయని అన్నారు. ఈ సందర్భంగా తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ప్రాచీ కృతజ్ఞతలు తెలిపారు.