తండ్రి మరణం..కన్నీళ్లతో పరీక్ష రాసిన విద్యార్థిని

ప్రజాశక్తి- హిందూపురం : అల్లారు ముద్దుగా చూసుకున్న తండ్రి అకస్మాత్తుగా మరణించాడు. ప్రతిరోజూ పరీక్ష కేంద్రానికి ద్విచక్రవాహనంలో తీసుకెళ్లే తండ్రి విఘతజీవిగా ఇంట్లో ఉన్నాడు. కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్న వేళ ద్ణుఖాన్ని దిగమింగుకుని ఇంటర్‌ పరీక్షకు హాజరయ్యారు ఆ విద్యార్థిని. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో చోటు చేసుకున్న ఈ విషాధ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి… హిందూపురం పట్టణానికి చెందిన సిద్ధూ(46) ఈనాడులో సీనియర్‌ జర్నలిస్టుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కుమార్తె తస్లీమ్‌ ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. గుండెపోటుతో సిద్ధూ మంగళవారం మరణించారు. రాత్రంతా తండ్రి మృతదేహం వద్ద కన్నీటి పర్యంతమైన తస్లీమ్‌.. బుధవారం ఉదయాన్నే పరీక్ష కేంద్రానికి హాజరయ్యారు. బాగా చదువుకోవాలని తండ్రి చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుని.. ద్ణుఖాన్ని దిగిమింగుకుని ఫిజిక్స్‌ పరీక్షను పూర్తి చేశారు. అనంతరం తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

➡️